ఆటో ఢీకొని వ్యక్తి మృతి
పెనమలూరు :
ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పోరంకి పచ్చళ్ల కంపెనీ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోరంకికి చెందిన నీలాపు రాంబాబు (50) ఉప్పు వ్యాపారం చేస్తుంటాడు. స్థానిక పచ్చళ్ల కంపెనీ వద్ద రోడ్డు దాటుతుండగా కంకిపాడు వైపు నుంచి విజయవాడ వస్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొనడంతో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.