కారు ఢీకొని ఆర్‌ఎంపీ మృతి


హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నార్సింగి వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో నార్సింగికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు కొండయ్య(58) మృతిచెందారు.



ద్విచక్రవాహనంపై వెళుతున్న కొండయ్యను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో కొండయ్య అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top