రిటైర్డ్ ఏఎస్సై ఆత్మహత్య


మిర్యాలగూడ (నల్లగొండ) : కుటుంబ కలహాలతో ఓ రిటైర్డ్ ఏఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్‌లో మంగళవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న యోగానందం(62) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top