బాలల సంరక్షణ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పని సరి
హిందూపురం అర్బన్: బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు సెక్షన్ 41 ప్రకారం తప్పనిసరిగా ఈ నెల 26వతేది లోపు రిజిస్రే్టషన్ చేయించాలని నిర్వాహకులకు జువెనైల్ జిల్లా ప్రాజెక్టు అధికారి రామసుబ్బారెడ్డి సూచించారు. హిందూపురంలోని సత్యసాయిబాల సదన్, ఐసీడీఎస్ బాలసదన్ కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. పిల్లలకు కల్పిస్తున్న సదుపాయాలు, భోజనాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాలను రిజిస్రే్టషన్ చేయించకపోతే సెక్షన్ 42 ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు.