పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి

పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి - Sakshi


తిరుపతి: టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేశారు. సోమవారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు స్మగ్లర్లు కంటపడ్డారు.  లొంగిపొమ్మని హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా వారు.. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ పోలీసుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఓ రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపారు.



ఈ సంఘటన ముంగిలిపట్టు పరిధిలోని అక్కన్న దొన ఏరియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ కొనసాగుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top