రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం సీజ్
చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అటవీశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు. దాంతో డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారైయ్యాడు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 50 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.