రేషన్‌ బియ్యం స్వాధీనం

రేషన్‌ బియ్యం స్వాధీనం


గౌరవరం(జగ్గయ్యపేట) : రేషన్‌ బియ్యాన్ని రెండు లారీల్లో తరలిస్తుండగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్న సంఘటన ర్‌ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. వత్సవాయి మండలం లింగాల గ్రామం వైపు నుంచి రెండు లారీల్లో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబుకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన విజిలెన్స్‌ సీఐ అబ్దుల్‌ నబి సిబ్బందితో కలిసి గ్రామంలోని జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీలో రెండు లారీల్లో బియ్యం వస్తున్నట్లు గుర్తించి రెండు లారీలను అదుపులోకి తీసుకున్నారు. రెండు లారీల్లో 700 బస్తాల్లో 35 టన్నుల రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. అనంతరం వాటిని చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విజిలెన్స్‌ సీఐ మాట్లాడుతూ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ డీటీకు అప్పగించినట్లు తెలిపారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top