సీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం!
విశాఖపట్నం : పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలను ఉపరితల ఆవర్తనం ఆనుకుని ఉందని పేర్కొంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.