కృష్ణా జిల్లాలో ఓ మోస్తరు వర్షం
మచిలీపట్నం : కృష్ణాజిల్లాలో గురువారం ఒక మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 25.0 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా విస్సన్నపేటలో 15.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా మచిలీపట్నంలో 0.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కట్టలేరు పొంగి ప్రవహించడంతో నందిగామ కూడలి వద్ద వీరులపాడు చప్టాపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతాల మధ్య రాకపోకలను నిలిపివేశారు.