మూడోవారంలో రాహుల్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల మూడోవారంలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు. పర్యటన తేదీతో పాటు ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. నగరంలో నిర్వహించే ఒక కార్యక్రమంలో విద్యార్థులతో సమావేశమవుతారని, గాంధీభవన్ను సందర్శిస్తారని శుక్రవారం విలేకరులకు చెప్పారు. వరంగల్లో నిర్వహించే అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారని, భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో సమావేశమవుతారని తెలిపారు.