టీటీడీకి చెందిన డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్


తిరుపతి: తిరుపతిలోని టీటీడీకి చెందిన ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలో బుధవారం ర్యాగింగ్ వెలుగులోకి వచ్చింది. డిగ్రీ విద్యార్థి ప్రణయ్ను సీనియర్లు మంగళవారం ర్యాగింగ్ పేరిట వేధించారు. దాంతో సదరు జూనియర్ విద్యార్థి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో ప్రణయ్తోపాటు అతడి తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి సీనియర్లపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ ప్రణయ్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top