వైఎస్ విగ్రహానికి రాఖీ
మహబూబాబాద్: వరంగల్ జిల్లా మహబూబాబాద్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గుగులోత్ రాములు నాయక్ నేతృత్వంలో స్థానిక వైఎస్సార్ విగ్రహం ఎదుట వేడుకలు నిర్వహించారు. రాములు నాయక్ సతీమణి గుగులోత్ సరోజ వైఎస్ విగ్రహానికి రాఖీ కట్టారు.