ఈ నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా..

ఈ నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా..


చొప్పదండి(కరీంనగర్‌ జిల్లా):

చొప్పదండి మండల కేంద్రానికి చెందిన సంధ్యారాణి(26) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంధ్యారాణికి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల10న పెళ్లి జరగాల్సి ఉండగా.. సంద్యారాణి నాయనమ్మ మృతిచెందడంతో పెళ్లి వాయిదా పడింది.



సంధ్యారాణి ఓ ప్రైవేటు స్కూల్లో హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top