4 లక్షల పుష్కర్‌ జల్‌ బాటిళ్లు

4 లక్షల పుష్కర్‌ జల్‌ బాటిళ్లు

 

ఒంగోలు సబర్బన్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 4 లక్షల పుష్కర్‌ జల్‌ బాటిళ్లు సరఫరా చేసినట్లు ఎస్‌ఎస్‌పి టీఏవీ శర్మ తెలిపారు. ఒంగోలు పోస్టల్‌ డివిజన్‌ పరిధిలో 25 వేల బాటిళ్లను భక్తులకు అందించినట్లు చెప్పారు. స్థానిక ఎస్‌ఎస్‌పీ కార్యాలయంలో మంగళవారం ఆయన పోస్టల్‌ సిబ్బందితో కలిసి విలేకర్లతో మాట్లాడారు.

 

పుష్కర జలం బాటిళ్ల బుకింగ్‌కు జిల్లాలోని ప్రజలు ఆసక్తి చూపారన్నారు. విజయవాడ నుంచి కృష్ణా పుష్కర జలాలను 15 దశల్లో శుద్ధి చేసి భక్తులకు అర్ధ లీటరు బాటిళ్లలో అందించామన్నారు. పుష్కరాల ముగింపు నేపథ్యంలో సోమవారం నాటికే పుష్కర జలం పంపిణీని పూర్తి చేశామని తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో పథకం సాధించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు ఈ పోస్ట్‌ మెసేజ్‌ ద్వారా అభినందనలు తెలిపేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు.

 

పీవీ సింధు కేరాఫ్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్, జీపీఓ, హైదరాబాద్‌ అడ్రస్‌కు ఈ పోస్ట్‌ మెసేజ్‌ చేస్తే సింధు ఇంటికి చేర్చేలా పోస్టల్‌ శాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. పోస్టల్‌ శాఖకు సంబంధించి ఫ్రాంచైజీ అవుట్‌ లెట్‌లను మంజూరు చేస్తామని శర్మ పేర్కొన్నారు. ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు ఎస్‌ఎస్‌పీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top