12శాతం రిజర్వేషన్ కల్పించాలి
మిర్యాలగూడ టౌన్ : గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ను కల్పించాలని, లేకుంటే 2019లో జరిగే ఎన్నికల్లో అంతా ఏకమై టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సి వస్తుందని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ధరావత్ గణేష్నాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, కళాశాల హాస్టళ్లను సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించినందున వాటిలో 12శాతం గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. విద్యాహక్కు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు.
ఫీజురీరుుంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయకుండా వారి జీవితాలతో చెలగాటం అడుతున్నారని ఆరోపించారు. కామన్ విద్య విధానాన్ని అమలు చేస్తేనే అందరికి విద్య అందుతుందన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పాతులోతు మేష్యానాయక్, మండల పార్టీ అధ్యక్షులు పిల్లుట్ల బ్రహ్మం, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మణ్నాయక్, ఎల్హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు సైదానాయక్ , గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధనావత్ చిన్యానాయక్ తదితరులున్నారు.