ఆసుపత్రి నిర్వాకంపై ఆందోళన


గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. డెలివరీ కోసం మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మహిళకు సరైన చికిత్స అందకపోవడంతో ఇద్దరు కవలలతో సహా మహిళ మృతి చెందింది.



దీంతో వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ఈ దారుణం జరిగిందని ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు సరైన చికిత్స అందించకుండా.. చివరి క్షణంలో వేరే ఆసుపత్రికి వెళ్లమని సూచించడంతోనే మార్గమధ్యలో ఆ మహిళ మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top