విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం వడగాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రెండు స్తంభాలు రాజీవ్ రదారిపై పడటంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలు తెగిపోవటంతో మండలంలోని పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది.