కిడ్నాప్ గుట్టురట్టు
చింతకొమ్మదిన్నె(వైఎస్సార్ జిల్లా): డబ్బు కోసం ఓ పారిశ్రామిక వేత్తను కిడ్నాప్ చేసిన ముఠా గుట్టు రట్టైంది. వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె తెలుగు గంగ వీధికి చెందిన సోమా రెడ్డయ్య అనే పారిశ్రామిక వేత్తను గుర్తుతెలియని దుండగులు గత నెల 28న కిడ్నాప్ చేశారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు ఫోన్చేసి రూ. 35 లక్షలు డిమాండ్ చేశారు.
దీంతో భయాందోళనలకు గురైన ఆయన కుమారుడు కిడ్నాపర్లకు రూ. 2 లక్షలు ఇచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. రంగలోకి దిగిన పోలీసులు తెలుగు గంగ ప్రాంతంలోని పరిసర ప్రాంతాల్లో వెతకకగా.. ఓ పాతబంగ్లాలో కట్టేసి ఉన్న సోమా రెడ్డయ్యను రక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి కిడ్నాప్తో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కడప డీఎస్పీ అశోక్కుమార్ ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.