పోలీసు విచారణ లేకుండానే పాస్‌పోర్ట్

పోలీసు విచారణ లేకుండానే పాస్‌పోర్ట్ - Sakshi


విశాఖపట్నం పాస్‌పోర్ట్ కేంద్రం అధికారి ఎన్‌ఎల్‌పీ చౌదరి  

మర్రిపాలెం (విశాఖపట్నం): పోలీసు విచారణతో సంబంధం లేకుండానే పాస్‌పోర్ట్ మంజూరు చేస్తామని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రం పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి. చౌదరి గురువారం ప్రకటించారు. సాధారణ పాస్‌పోర్ట్ సేవలను మరింత సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే అభ్యర్థి దరఖాస్తు సమర్పించే సమయంలో ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డు, పాన్‌కార్డ్‌తో పాటు ఫారం ‘అనెక్సార్-ఐ’ను అదనంగా సమర్పించాలని చెప్పారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు (పీవీఆర్) లేకుండానే పాస్‌పోర్ట్ జారీ చేస్తామన్నారు. అభ్యర్థి సమర్పించిన పత్రాలు ఆన్‌లైన్‌లో పరిశీలనకు అందుబాటులో ఉండాలన్నారు. దీనికి ఎటువంటి అదనపు ఫీజులు ఉండవని స్పష్టం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top