జీపును ఢీ కొన్న లారీ: ఎస్ఐ, హోంగార్డుకి గాయాలు


నెల్లూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కర్కటంపాడు మలుపు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు జీపును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయగిరి ఎస్ఐ, హోంగార్డు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన పోలీసులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.


ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  క్రైమ్ రివ్యూ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top