పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ వివాదంపై విచారణ

పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ వివాదంపై విచారణ - Sakshi


ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ హీరోలు పవన్ కల్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య ఏర్పడ్డ వివాదంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. భీమవరంలో శుక్ర, శనివారాలు 144 సెక్షన్ విధించారు. హీరోల అభిమానులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.



పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా భీమవరంలో ఫ్యాన్స్‌ కట్టిన ఫ్లెక్సీలను ఎవరో చింపేశారు.  అయితే హీరో ప్రభాస్‌ అభిమానులే వాటిని చింపేశారంటూ.... పవన్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చేపట్టారు. ప్రభాస్‌ ఫ్లెక్సీలను చించేసి, నిప్పంటించారు. రోడ్డు పక్కనున్న షాపులను ధ్వంసం చేసి, రాస్తారోకో చేశారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top