జమ్మికుంటలో కార్డన్‌సెర్చ్‌

జమ్మికుంటలో కార్డన్‌సెర్చ్‌


జమ్మికుంట: కరీంనగర్‌జిల్లా జమ్మికుంట పట్టణంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దుర్గా కాలనీలోని ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు.



ఈ సందర్భంగా 10 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, రూ.30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లు, బాణసంచా, మద్యం నిల్వలు, 25 లీటర్ల కిరోసిన్‌, 4 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 300 పోలీసులు పాల్గొన్నారు. కాగా, జమ్మికుంట పోలీసు స్టేషన్‌లో జనగణమన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top