సూర్యాపేటలో కార్డెన్‌ సెర్చ్‌


సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కాలనీని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టిన పోలీసులు గాలింపు జరిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.



ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, ఓ ఆటో స్వాధీనం చేసుకున్నారు. కార్డెన్‌ సెర్చ్‌ల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని.. సురక్షిత సమాజం కోసమే ఈ తనిఖీలు చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top