'నగ్నంగా వీడియో తీసి బెదిరించాడు..'
జంగారెడ్డిగూడెం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరుకు చెందిన వివాహిత వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో.. ప్రధాన నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్ ఆమెను నగ్నంగా వీడియోలు తీసి బెదిరించినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. వీడియోలు నెట్లో పెడతానని బెదిరించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని వివరించారు. గుడాల సాయి శ్రీనివాస్ను శనివారం పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
కృపామణి భర్త మీద పెట్టిన కేసు పరిష్కారం కోసం సాయి శ్రీనివాస్ కృపామణితో పరిచయం పెంచుకున్నాడని ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికార్ల పేర్లతో డబ్బులు గుంజడం శ్రీనివాస్కు అలవాటని చెప్పారు. నిందితుడి నుంచి రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని భాస్కర్ తెలిపారు. తణుకు ఆస్పత్రిలో నిందితుడు గుడాలసాయి శ్రీనివాస్కు వైద్యపరీక్షలు నిర్వహించారు.
తణుకుకు చెందిన గుడాల సాయిశ్రీనివాస్తో పాటు తన తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫోన్లో రికార్డ్ చేసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.