అమరావతిలో మోదీ పర్యటన ఖరారు

అమరావతిలో మోదీ పర్యటన ఖరారు - Sakshi


- రాజధాని శంకుస్థాపన అనంతరం తిరుమల వెళ్లనున్న ప్రధాని



హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి రాక ఖరారయింది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11:45కు గన్నవరం చేరుకునే ఆయనకు అధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకోనున్న మోదీ.. మధ్యాహ్నం 12:35 గంటలకు రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.



దాదాపు రెండు గంటలపాటు అక్కడే గడుపుతారు. ఆ తరువాత 2:45 గంటలకు అమరావతి నుంచి తిరుపతికి పయనమవుతారు. 4:05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడినుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం 5:25 గంటలకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. కార్యక్రమాలను ముగించుకుని రాత్రి 7:30 గటలకు మోదీ తిరిగి ఢిల్లీ పయనమవుతారు. ఈ మేరకు ప్రభుత్వాధికారులు ప్రధాని పర్యటన వివరాలను శుక్రవారం వెల్లడించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top