తాగడానికి డబ్బుల్లేక వ్యక్తి ఆత్మహత్య


తాళ్లపూడి : మండలంలోని అన్నదేవరపేట గ్రామంలో ఓ వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. తాళ్లపూడి ఎస్సై జె.సతీష్‌ తెలిపిన కథనం  ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన మజ్జి సింహచలం (50) గొర్రెలను కాసుకుంటూ జీవిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తాగడానికి డబ్బుల్లేకపోవడంతో మనస్తాపానికి గురై ఒంటి పై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను మరణించాడు. మృతుడికి భార్య ఉన్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top