కడపలో పాస్‌పోర్టు కార్యాలయం


కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : గల్ప్‌ దేశాలకు వెళ్లేవారు  పాస్‌ పోర్టు కోసం తిరుపతి, హైదరాబాద్‌ ప్రాంతాలకు  వెళ్లాల్సిన అవసరం లేదు.  కేంద్ర ప్రభుత్వం జిల్లా ప్రజల కోసం   కడప పోస్టల్‌ కార్యాలయంలో పాస్‌ పోర్టు కార్యాయాలన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సరిపడా గదులను సైతం నిర్మిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా కువైట్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌  మలేషియా, అమెరికా వంటి దేశాలకు జీవనోపాధి కోసం ఎక్కువ సంఖ్యలో ప్రజలు వెళుతుంటారు.  పాస్‌ పోర్టు తయారు చేయించుకోవడానికి ఇతర ప్రాంతాలైన తిరుపతి. హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చేది.  పాస్‌ పోర్టులో ఏవైనా పొరపాట్లు  మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి. దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బు వృథా అయ్యేవి. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తొలగనున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top