ఓవర్‌టేక్ చేస్తూ బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు


నల్లగొండ : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల ముత్యాలమ్మగూడెం వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సితార ట్రావెల్స్ బస్సు ముత్యాలమ్మగూడెం సమీపంలో మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది.


దీంతో బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని 108 సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రహదారిపై ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top