ఎండలో ఆమ్లెట్ !
పరకాల: భగభగ మండుతున్న ఎండలు.. బయటకు రావాలంటే భయపడిపోతున్న జనం.. ఈ ఎండకు మనుషులు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. వేడెక్కిన రోడ్డుపై ఎలాంటి మంట లేకుండానే ఆమ్లెట్ వేశారు వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన యువకులు. పరకాలకు చెందిన యువకుడు నరేశ్ కల్లు మండువా ఎండలో కొద్ది సేపు స్టీల్ ప్లేట్ పెట్టి కోడిగుడ్డు పోశాడు. కొద్ది సేపటికే అది ఆమ్లెట్ అయింది. దీంతో కల్లు తాగేందుకు వచ్చిన పలువురు ఒకరిని చూసి మరొకరు ఆమ్లెట్ వేయడం కనిపించింది.
22 పీఆర్కేఎల్ 04, 05 : ఎండ వేడికి ఆమ్లెట్ వేస్తున్న యువకులు