హెచ్‌సీఏ లీగ్‌లో పాలమూరు హవా


87 పరుగుల తేడాతో  కరీంనగర్‌పై గెలుపు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హెచ్‌సీఏ అండర్‌–23 లీగ్‌ టూడేస్‌ మ్యాచ్‌లలో జిల్లా జట్టు హవా కొనసాగుతోంది. కరీంనగర్‌ పట్టణంలో ఆ జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాలమూరు జట్టు 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. జిల్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్‌ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 43.2 ఓవర్లలో 140 పరుగలకు ఆలౌట్‌ అయింది. జట్టులో అల్యాల (31), సిద్దార్థ్‌రెడ్డి (25) పరుగులు చేశారు.


జిల్లా బౌలర్లు రహీం, మహ్మద్‌ ఖయ్యూం చెరో నాలుగేసి వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్‌లో జిల్లా జట్టు ధాటిగా ఆడింది. 36 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్‌ అయింది. జిల్లా బ్యాట్స్‌మెన్లు సునీల్‌రెడ్డి 60 పరుగులు (58 బంతుల్లో 6 ఫోర్లు), ఖయ్యూం (37), రాకేశ్‌యాదవ్‌ (37) పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో  కరీంనగర్‌ జట్టు 38.5 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. అశోక్‌ (43) పరుగులు చేశారు. జిల్లా బౌలర్లు శ్రీనివాస్‌ 4, జుబేర్, గణేష్, ఖయ్యూం చెరో వికెట్‌ తీశారు. జిల్లా జట్టు తన మూడో లీగ్‌ మ్యాచ్‌ను ఈనెల 8 నుంచి వరంగల్‌లో ఆడనుంది.



ఎండీసీఏ ప్రతినిధుల అభినందన

హెచ్‌సీఏ అండర్‌–23 రెండో లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన జిల్లా జట్టు సభ్యులను మహబూబ్‌నగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్‌ అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్‌అలీ అభినందించారు. లీగ్‌లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు తమవంతు ప్రోత్సాహం ఉంటుందని, మరింత ప్రతిభ కనబర్చి రాష్ట్రజట్టుకు ఎంపికకావాలని ఆకాంక్షించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top