ఒడిశా ఆర్టీసీ బస్సు సీజ్
సాలూరు : తప్పడు పర్మిట్తో నడుస్తున్న ఒడిశా ఆర్టీసీ బస్ను సాలూరు మోటారువెహికల్ ఇన్స్పెక్టర్ పీవీ గంగాధర్ సీజ్ చేశారు. బుధవారం ఒడిశాలోని బరంపూర్ నుంచి నవరంగపూర్, సాలూరు మీదుగా వెళ్తున్న ఓఆర్ 07 క్యూ 7285 నంబరు బస్సును స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో తనిఖీ చేశారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు ఆంధ్రా పర్మిట్ లేకపోగా.. వేరే నంబరు పర్మిట్ పత్రాలతో నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో సీజ్ చేసి స్థానిక ఆర్టీసీ డిపోకు తరలించారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.