రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు


లావేరు : మండలంలోని సుభద్రాపురం జంక్షన్‌ వద్ద  టాటా ఏస్‌ లగేజీ వాహనాన్ని ద్వి^è క్ర వాహనం ఢీకొన్న ఘటనలో రణస్దలం మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన చాయారి పోలోడు అలియాస్‌ వినోద్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.  వివరాలు ఇలా ఉన్నాయి. జగన్నాధపురం గ్రామానికి చెందిన చియారి పోలోడు  మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంతో రణస్థలం నుంచి శ్రీకాకుళం Ðð ళ్తుండగా లావేరు మండలంలోని సుభధ్రాపురం జంక్షన్‌ వద్ద బుడుమూరు నుంచి లావేరు వైపు వెళ్లడం కోసం సుభద్రాపురం జంక్షన్‌లో టాటా ఏస్‌ వాహనం తిరుగుతుండగా ద్విచక్ర వాహనం వచ్చి ఢీకొంది.

 

దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వినోద్‌ ఎగిరిపడి రోడ్డుపై పడ్డారు. దీంతో అతని తలకు బలమైన గాయమైంది. గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వినోద్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకుÐð ళ్లాలని రిమ్స్‌ వైద్యులు సూచించడంతో తీసుకువెళ్లారు. ప్రస్తుతం గాయపడ్డ అతను కోమాలో ఉన్నారు. టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొన్న ద్విచక్ర వాహనం నుజ్జు నుజ్జు అయింది. లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Election 2024

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 


 

Read also in:
Back to Top