ఫ్లైఓవర్పై నుంచి పడిన స్కార్పియో: ఒకరు మృతి


శ్రీకాకుళం : శ్రీకాకుళం కొత్తరోడ్డు ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటనపై సమాచారం అందుకున్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బరంపురం నుంచి జైపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top