విజయవాడలో లింగన్నాయుడుపేట వాసి దుర్మరణం
లింగంన్నాయుడుపేట (జలుమూరు) : సైరిగాం పంచాయతతీ లింగంన్నాయుడుపేటకు చెందిన బోనెల రవి(26) విజయవాడలో సోమవారం రాత్రి బస్ ప్రమాదంలో మరణించాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం...∙మూడు నెలలు క్రితం స్వగ్రామం లింగంన్నాయుడుపేట నుంచి విజయవాడకు నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లి ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విజయవాడ పట్టణంలో ఆటోలో వస్తుండగా నిలిచి ఉన్న ఆటోకు ఎదురుగా వస్తున్న అర్టీసీ బస్ ఢీకొనడంతో రవి తీవ్రగాయలై మరణించాడు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు సారవకోట మండలం వాసులుగా చెబుతున్నారు. మృతుడు రవికి భార్య భవానీతో పాటు కొడుకు వినయ్ కుమార్తె ధరణీ తండ్రి రాజు ఉన్నారు. భర్త మరణవార్త విన్న భవానీ నెలల పాపను పట్టుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.