రైలు నుండి జారిపడి వ్యక్తి దుర్మరణం
పార్వతీపురం: రైలు నుండి జారిపచి గుర్తుతెలియని వ్యక్తి ఒకరు మతిచెందినట్లు విజయనగరం రైల్వే హెచ్సీ బి. గౌరునాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం మరిపి వలస వద్ద విశాఖనుంచి పార్వతీపురం వస్తున్న గుర్తుతెలియని రైలునుంచి దాదాపు 65ఏళ్ల వయసుగల వ్యక్తి జారిపడి మరణించినట్టు తెలిపారు. మతుడి శరీరంపై తెలుపు లాల్చీ, పంచె ఉన్నాయని తెలిపారు. సంబంధీకులు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.