వృద్ధుడి ఆత్మహత్యాయత్నం


కోవెలకుంట్ల: పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయ సమీపంలో నివాసముంటున్న కుమ్మరి వెంకటస్వామి (62) ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై తాగుడు మానుకోలేక మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించిన హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 50 శాతం శరీరభాగాలు కాలిపోవడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మంజునాథ్‌ పేర్కొన్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top