వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
మంగళగిరి : మండలంలోని కాజ టోల్గేట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆత్మకూరు గ్రామం నిమ్మగడ్డ రామ్మోహనరావు కాలనీలో నివాసముంటున్న కె.మాలదాసు (60) మృతిచెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మాలదాసు చేనేత కూలీపని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. కాజ గ్రామంలో నివాసముంటున్న తమ యజమాని ఇంటికి డబ్బుల కోసం వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో తిరిగివస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు.