నిజాం మ్యూజియంలో ఫొటో ఎగ్జిబిషన్

నిజాం మ్యూజియంలో ఫొటో ఎగ్జిబిషన్ - Sakshi


యాకుత్‌పురా: ఏడో నిజాం హెచ్‌ఈహెచ్‌ మీర్‌ ఉస్మాన్  అలీ ఖాన్  50వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పురానీహవేలిలోని నిజాం మ్యూజియంలో ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్  ఏర్పాటు చేశారు. నిజాం మీర్‌ ఉస్మాన్  అలీ ఖాన్  1967 ఫిబ్రవరి 24న దివంగతులయా్యరని నిజాం మ్యూజియం క్యూరేటర్‌ భాస్కర్‌ రావు తెలిపారు.


మ్యూజియంలో ఉస్మాన్  అలీ ఖాన్  ధరించిన బట్టలు, వస్తువులు, ఆభరణాలతో పాటు ఇప్పటికే సిటీ మ్యూజియం కొనసాగుతుందన్నారు. ఆయన అంత్యక్రియల్లో 10 లక్షల మంది ప్రజలు హజరయా్యరన్నారు. అంత్యక్రియల సందర్భంగా తీసిన ఫోటోలను ప్రత్యేకంగా ప్రదర్శనలో ఉంచారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ ఫోటో ప్రదర్శన కొనసాగనుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top