సీబీఐ లక్ష్మీనారాయణ పేరుతో మోసాలు!
హైదరాబాద్: సీబీఐ మాజీ జేడీ, ప్రస్తుత థానె పోలీసు కమిషనర్ లక్ష్మీనారాయణ పేరుతో మోసాలకు పాల్పడిన నైజీరియా గ్యాంగ్ ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా నైజీరియాకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి మోసాలకు తెర లేపారు. హైదరాబాద్ లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తామంటూ ఆన్ లైన్ లో 10 లక్షల రూపాయలను సేకరించారు.
అయితే వారిపై అనుమానం వచ్చిన బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నైజీరియా గ్యాంగ్ లో ముగ్గురు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.