రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి మృతి


విశాఖపట్నం: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో నేవీ ఉద్యోగి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నంలోని పెద్ద రిషికొండ జంక్షన్ వద్ద శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతిచెందిన నేవీ ఉద్యోగి జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన హర్షపురి(35)గా గుర్తించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top