ఘనంగా కలాం జయంతి వేడుకలు


శంషాబాద్: జిల్లాలోని నర్కుడా లీడ్ ఇండియా భవన్ లో శనివారం మాజీ రాష్ట్రపతి, భారతరత్న స్వీర్గీయ అబ్దుల్ కలాం 85వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఇండియా భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కలాం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.



ఆయనకు ఘన నివాళులు అర్పించి, కలాం నిరాడంబర జీవితాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top