ముండూరు విద్యార్థికి అరుదైన గౌరవం


ముండూరు (పెదవేగి రూరల్‌) : పెదవేగి మండలం ముండూరు గ్రామానికి చెందిన విద్యార్థి ఆలపాటి రేవతి వెంకట చౌదరికి అరుదైన గౌరవం లభించింది. ఆలపాటి నరసింహమూర్తి, నాగకుమారి దంపతుల కుమారుడైన వెంకట చౌదరి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్యారిస్‌ స్కిమా బిజినెస్‌ స్కూల్‌లో (స్కిమా విశ్వవిద్యాలయం) విద్యనభ్యసిస్తున్నాడు. ప్రాజెక్ట్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో అతడికి ఈ ఏడాది ఫలితాల్లో రజిత పతకం లభించింది. వర్సిటీ నుంచి ఈ ఫలితాన్ని అందుకున్న ఏకైక భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందాడు. ప్రపంచంలోని ఉత్తమ బిజినెస్‌ స్కూల్‌లో స్కిమా 25వ స్థానంలో, మేనేజ్‌మెంట్‌ విభాగంలో 9వ స్థానంలో ఉంది. తమిళనాడులోని వినాయక విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన వెంకట చౌదరి స్కిమా బిజినెస్‌ స్కూల్‌లో సీటు రావడంతో అక్కడ విద్యనభ్యసిస్తున్నాడు. పీహెచ్‌డీ అనంతరం ఐఏఎస్‌కు ఎంపిక కావడమే తన లక్ష్యమని విలేకరులకు తెలిపాడు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top