'ప్రత్యేక హోదా తీర్మానం అభ్యర్థన మాదిరిగా ఉంది'

'ప్రత్యేక హోదా తీర్మానం అభ్యర్థన మాదిరిగా ఉంది' - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన తీర్మానం అభ్యర్థన మాదిరిగా ఉందని సీపీఐ నేత చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ గురువారం శాసనమండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై మాట్లాడిన సీపీఐ నేత చంద్రశేఖర్.. ప్రత్యేక హోదాపై శాసనమండలిలో ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం అభ్యర్థన మాదిరిగా ఉందని.. ఇంకా బలంగా ఉండాలని ఆయన సూచించారు.


 


ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షాన్ని నిర్ణయించి ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నారు. పట్టిసీమ ద్వారా సీమకు నీళ్లు ఇస్తామంటున్న చంద్రబాబు నాయుడు.. అందుకు వాటర్ కమిషన్ వేస్తే మంచిదన్నారు.  ఏపీ శాసనమండలి శుక్రవారానికి వాయిదా పడింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top