ఎమ్మెల్సీ ఎన్నికల రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు
మదనపల్లె రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిసెప్షన్ కౌంటర్, పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్రూం ఏర్పాటు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఆమె శనివారం పాఠశాలను పరిశీలించి కౌంటర్ ఏర్పాటుపై సిబ్బందికి సూచనలిచ్చారు. మదనపల్లె డివిజన్ పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికలను పర్యవేక్షించేలా అన్ని వసతులు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు.
బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఏవో సురేంద్ర, డీటీ రఫీక్, ప్రధానోపాధ్యాయురాలు ఆర్సీ తిరుమల, సర్వేయర్ కృష్ణమూర్తి, వీఆర్వో గిరి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.