వాస్తు పేరుతో డబ్బు వృథా

వాస్తు పేరుతో డబ్బు వృథా - Sakshi


 ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ,ముఖ్యమంత్రి కేసీఆర్ , టీడీపీ

 సాక్షి, మహబూబాబాద్: వాస్తు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సరిగా ఉన్న భవనాలను  కూల్చివేసి డబ్బులు వృథా చేస్తున్నారని సత్తుపల్లి  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మాయమాటలు చెప్తూ కేసీఆర్ రోజుకో కొత్తనాటకం ఆడుతున్నారని అన్నారు. జిల్లాల ఏర్పాటు పేరుతో ప్రజల మధ్య యుద్ధం సృష్టిస్తున్నారని తెలిపారు.



ఖరీఫ్ సీజన్ పూర్తయినా రుణమాఫీ ఇప్పటి వరకు 12 శాతం కూడా చేయలేదన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు సాధించుకున్న రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఉపయోగపడుతోందన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top