నాన్న కల నెరవేరింది!

నాన్న కల నెరవేరింది!


ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి

భూత్పూర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదల




మక్తల్‌: నియోజకవర్గ రైతులకు సాగు నీరందించాలన్న తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి చిరకాల వాంఛ నెరవేరిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్‌ మండలం భూత్పుర్‌ రిజర్వాయర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ నుంచి నీటిని విడుదల చేశారు. అనంతరం మక్తల్‌ మండలం సంగంబండ గ్రామం దగ్గర చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్‌సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి హైలెవల్‌ లెప్ట్‌ కెనాల్‌ నుంచి నీటిని చెరువులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ భూత్పుర్‌ రిజర్వాయర్‌ నుంచి, సంగంబండ రిజర్వాయర్‌ నీటిని చెరువులకు, పొలాలకు విడుదల చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.



తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తప్ప మరేమి లేదని తన వద్ద అనే వాడన్నారు. ఆయన ఆశయ సాదన కోసమే నడుం భిగించి కేసీఆర్, రాష్ట్ర మంత్రుల సహకారంతో పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులను పూర్తిచేసి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు మార్కెట్‌ చైర్మన్‌ నరిసంహగౌడ్, మహిపాల్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, ఈఈ భూపాల్‌రెడ్డి, డీఈలు నాగిరెడ్డి, గోపాల్‌చారి, తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top