'కర్మకాండల ఖర్చు కూడా భరిస్తాం'
సంగారెడ్డి మున్సిపాలిటీ: మెదక్ జిల్లాలోని కంగ్లి మండలం దేగులొవాడిలో విద్యుత్షాక్కు గురై మృతి చెందిన కుటుంబాలను మంత్రి హరీశ్రావు సోమవారం పరామర్శించారు. విద్యుత్ షాక్తో పెళ్లి బృందంలోని ఏడుగురు ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. గాయపడినవారికి ఆస్పత్రి ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మృతుల కుటుంబాల్లో పది రోజుల పాటు జరిగే కర్మకాండల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని తండాల్లో విద్యుత్ వైర్ల సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఘటనకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.