అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

అర్ధరాత్రి అగ్ని ప్రమాదం - Sakshi


కట్టెల దుకాణాలు దగ్ధం

  కాలిన పెళ్లి మండపాల ఏర్పాటు సామగ్రి

  రూ. 10లక్షల ఆస్తినష్టం

 

 భువనగిరి అర్బన్ : పెళ్లి పందిర్లు ఏర్పాటు చేసే సామగ్రి, కట్టెల దుకాణాల్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి సమయంలో భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. ఫైర్‌స్టేషన్ అధికారి ఆర్.రాఘవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణ నికి చెందిన గుమ్ముల మల్లేష్, వాసం శంకర్, టి.భాస్కర్, వాసం వెంకటేశ్వర్లు వీరంతా పెళ్లిలు, ఇతర కార్యక్రమాలకు మండపాలు వేసేందుకు ఎదురు బొంగులు, పెద్దపెద్ద కట్టెలు, ఇతర సామగ్రి పెట్టుకుని నాలుగు దుకాణాలు నడుపుతున్నారు. రోజులాగే ఆదివారం కూడా షాపులను మూసివేసి వెళ్లిపోయారు.

 

 వీరి షాపుల ముందు ఉండే చె త్తాచెదారం నుంచి నిప్పురవ్వలు లేచి అర్ధరాత్రి సమయంలో షాపులలో ఉండే కట్టెలకు, ఎదురు బొంగులకు అంటుకుని చిన్న మంటలు వ్యాపించాయి. దీంతో పక్కపక్కనే ఉన్న ఒక్క షాపునుంచి మరొక షాపునకు మంటలు వ్యాపించాయి. ఇది గమనించి స్థానికులు వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వెంట నే అక్కడి చేరుకున్నారు. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో భువనగిరితోపాటు చౌటుప్పల్‌లో ఉన్న ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరగినట్లు తెలిపారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top