మేయర్‌ దంపతుల హత్య కేసు 30కి వాయిదా


చిత్తూరు (అర్బన్‌): చిత్తూరు దివంగత మేయర్‌ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్‌ హత్య కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.



కేసు విచారణలో భాగంగా నిందితుల్ని పోలీసులు గురువారం చిత్తూరు కోర్టులో హాజరుపరచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి కపర్తి తదుపరి విచారణను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top