షోరూంలో మారుతీ కారు చోరీ
మారుతి కార్ల షోరూం నుంచి కొత్త మారుతి కారు చోరీకి గురైంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని మారుతి షోరూం తాళాలు పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి కొత్త కారును ఎత్తుకెళ్లారు. గురువారం ఇది గుర్తించిన మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.